ASR: హుకుంపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ శుక్రవారం ఆదేశించారు. ఈనెల 25, 26, 27వ తేదీల్లో మత్స్యగుండం జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.