కృష్ణా: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా గుండె, కాన్సర్, నేత్ర వైద్య శిబిరం నిర్వహించి 650 మందికి ఉచిత వైద్యం చేశారు.