PLD: కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దుర్గి మండలం ఓబులేసుని పల్లెకు చెందిన కొమ్ము అబ్రాహాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ సభ్యత్వ భీమా కింద రూ.5 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. కష్టకాలంలో పార్టీ భీమా ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.