NLR: మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 4వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వైఓ. నందన్ తెలియజేశారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. కమిషనర్ చాంబర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు.