KDP: పులివెందుల పట్టణంలోని ఎరువుల దుకాణాలను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను, ఎరువుల బస్తాలను, ఎరువుల ధరలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి, పోలీసులతో వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎరువుల దుకాణాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.