VSP: విజయనగరం జిల్లా మానాపురం ROBకి సమాంతరంగా పశువుల రాకపోకలకు అనుకూలంగా రైల్వే సబ్వే ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ డీఆర్ఎం లలిత్ బోహారాను శుక్రవారం కోరారు. గజపతినగరం రైల్వే లైన్ వద్ద డ్రెయిన్ నిర్మాణం, ఆర్ఓబీ ఎలైన్మెంట్ అంశాలపై కూడా మంత్రి చర్చించారు. రైల్వే బోర్డుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డీఆర్ఎం హామీ ఇచ్చారు.