ELR: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో శనివారం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొన్నారు. ప్రజల వద్ద వినతులు స్వీకరించి వాటిని నమోదు చేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.