TPT: రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మహిళలు మామోగ్రామ్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్విమ్స్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య భాను సూచించారు. మంగళవారం రాజగోపాలపురం, పీవీ పురం గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్ష శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపాండూరు వైద్యాధికారి డాక్టర్ అనిత, గ్రామ సర్పంచులు మధుసూదన్ రావు, పోలమ్మ పాల్గొన్నారు.