కృష్ణా: జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు YCP నేత పోతిన మహేశ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో గొడవని వీధిలోకి తెచ్చుకుని మీడియా సిబ్బందిపై దాడికి చేయడం సరికాదన్నారు. గాయపడ్డ విలేఖరి రంజిత్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. మోహన్ బాబుపై చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.