సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీచౌడేశ్వరి దేవి ఆలయంలో మాల పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త డీ.సీ. ఈశ్వరయ్య ఆధ్వర్యంలో, జ్యోతి సంఘం సభ్యుల సమక్షంలో పూజారులు అమ్మవారిని అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.