KDP: బీ.కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామంలో బుధవారం చేపట్టిన రెవెన్యూ సదస్సులో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భూ సమస్యలతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, భూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు.