KRNL: కర్నూలు నగరంలోని కలెక్టరేట్లో అక్టోబర్ 13న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.