W.G: పెనుమంట్రలో ఏఎన్ఎం భాగ్యకుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండకూడదని, పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఉంచకూడదని చెప్పారు. దోమలు అధికమై విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని సూచించారు.