KDP: రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తుందని బద్వేల్ టీడీపీ నియోజకవర్గపు సమన్వయకర్త రితిష్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నాయపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామం పరిధిలోని వివిధ రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.