అన్నమయ్య: మదనపల్లెలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కన్యకా పరమేశ్వరి అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. సాయంత్రం అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.