SKLM: సాక్షి పత్రికలో వ్యవసాయంపై ప్రచురితమైన వక్రీకృత కథనాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలను కావాలనే వక్రీకరించి, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉన్న సాధారణ పరిస్థితులను మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి, రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్రపూరిత ప్రచారమని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.