ప్రకాశం: వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ రామన మహాలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఇస్తున్నట్లు ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.