SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. బుధవారం ఆమె పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల తొమ్మిదవ తేదీన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా చేపడుతున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. అర్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.