SKLM: రైతుల పట్ల అలసత్వం వహించిన ఇరిగేషన్ అధికారులపై ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సేవలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.