NDL: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం మాజీ సీఎం జగన్ అని మంత్రి సవిత ఆరోపించారు. ‘అనుమతులు లేని నిర్మాణం వల్లే రాయలసీయ ఎత్తిపోతల పథకాన్ని NGT అడ్డుకుంది. ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం జగన్కు, YCP నేతలకు అలవాటే. జగన్ మెప్పు కోసం YCP నాయకులు సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నారు. సీమలో ప్రతి ఎకరాకు నీరందించేది మేమే’ అన్నారు.