KRNL: ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు బీహార్లో జరిగిన జాతీయ స్థాయి మోడ్రన్ పెంటాథలాన్ లేజర్ రన్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారుడు వెంకట భరత్ అండర్-21 కేటగిరిలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి తెలిపారు. విజయవాడ కేంద్రంగా గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ చైర్మన్ రవీ నాయుడు వెంకట భరత్ను ఘనంగా సత్కరించారు.