KRNL: మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైంది. మాజీ MPTC డీపీ గోవిందమ్మ, రాఘవేంద్ర గ్రామ శివారులో పశుగ్రాసం నిల్వ చేసిన గడ్డివాములో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి, నీటిట్యాంకర్లు, JCB యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది.1.5 లక్షల నష్టం జరిగిందన్నారు.