ELR: కైకలూరు మండలం లింగాల గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతన బస్సు షెల్టర్, సీసీ రోడ్లను ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తుందని పేర్కొన్నారు.