E.G: నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో బుధవారం జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’గా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గోపవరం సమీపంలో రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. స్వచ్ఛపథం అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇదొక సామాజిక బాధ్యత అన్నారు.