CTR: ఎమ్మెల్యే కార్యాలయం లక్ష్మీనగర్ కాలనీలోని ప్రజాదర్బార్లో బుధవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గురజాలజగన్ మోహన్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తే అధినేత కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.