VZM: జామి మండలం భీమసింగి సచివాలయాన్ని ఎంపీడీవో అప్పలనాయుడు శనివారం సందర్శించారు. సచివాలయంలో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పలు సర్వేల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు.