ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు శనివారం విశేష పూజలు అందుకున్నాడు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి మూల విరాట్ను పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.