కృష్ణా: రాష్ట్రంలో నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలుస్తూ, వారిని ఆదుకోవాలన్న నినాదంతో ఈనెల 13న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న “రైతన్నకు అండగా వైసీపీ” నిరసన కార్యక్రమ ప్రచార కరపత్రాలను పార్టీ నేతలు భయ్యావారి వీధిలోని జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.