KRNL: కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామంలో శ్రీ దేవమ్మ అవ్వ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు అధ్వర్యంలో దేవాలయం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో టీడీపీ నేతలు చెన్నబసప్ప ధని, టిప్పు సుల్తాన్ ఉన్నారు.