కృష్ణా: గుడివాడ తాలూకా స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో ఫిబ్రవరి 13న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణ విశ్వనాథ్ ఇంటి తాళాలు పగులగొట్టి, రూ. 25 వేల విలువైన టీవీ, వెండి చెంబు, హోమ్ థియేటర్ స్పీకర్లు దొంగిలించిన కేసులో శ్యామ్, సాయి, ధనుష్ అనే ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.