KRNL: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. పెద్దటేకూరు గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తోందన్నారు. వేలిముద్రలు పడకపోయినా ఆ కార్డును స్కాన్ చేసి రేషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.