SKLM: వేసవి తాపం అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్లో మెడిటేరియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరం నిమిత్తం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.