ప్రకాశం: సీఎస్ పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో 18వ తేదీ నుంచి సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.30,116లు, ద్వితీయ బహుమతి రూ.20,116లు, తృతీయ బహుమతిగా రూ.10,116లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులు 17వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు.