TPT: ఎర్రావారిపాళెం మండలం ఉదయ మాణిక్యం గ్రామంలో రేపు చంద్రగిరి ఎమ్మెల్యే నాని పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. రైతుల సమస్యలు, భూ సమస్యలు పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల రైతులు, భూ సమస్యలు ఉన్నవారు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపింది.