ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడులో బుధవారం అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మండల ప్రత్యేక అధికారి రమేశ్ బాబు, తహశీల్దార్ రవిబాబు అన్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొని రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అలాగే వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.