ELR: ఏలూరు సత్రంపాడులోని జూనియర్ కళాశాల నందు మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం స్థాపించబడిందన్నారు. మానవ అభివృద్ధికి ఈ చట్టం ఒక మైలురాయ వంటిదని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రధానమన్నారు.