KKD: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో చేరాలనుకునేవారికి జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సనపల సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 8,971 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 37కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.