TPT: జిల్లాలో SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, DSP చెంచు బాబు సూచనలతో నేర నియంత్రణ చర్యలలో భాగంగా సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా దొరవారిసత్రం SI అజయ్ కుమార్ పలు లాడ్జిల్లో తనిఖీలు చేశారు. అనంతరం లాడ్జీ గదుల్లో మైనర్లు బస చేయకుండా చూడాలని లాడ్జి యాజమాన్యానికి సూచించారు.