ATP: ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని రామ్ నగర్లో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిపై ఆర్అండ్బీ అధికారులతో మంత్రి పయ్యావుల సమీక్ష నిర్వహించారు.