VZM: చెడు వ్యసనాలకు బానిసై గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందాడు. గంట్యాడ ASI రమణ వివరాల ప్రకారం స్దానిక మధుపాడకు చెందిన నోట్ల అచ్చం నాయుడు చెడు వ్యసనాలకు బానిస కావడంతో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురై గ్రామానికి సమీపంలోని కొబ్బరి తోటలో గడ్డి మందు తాగాడు. తల్లిదండ్రులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.