అన్నమయ్య: రైల్వే కోడూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, పదోన్నతి పొందిన కార్యదర్శి రవీంద్ర వర్మకు సన్మానం చేశారు. కొత్త కార్యదర్శిగా జై సూర్య, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ మనోజ్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.