ATP: జిల్లా పర్యటనలో భాగంగా శనివారం కలెక్టరేట్కు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్కు జిల్లా ఎస్పీ పి. జగదీష్ పూల మొక్క అందించి సాదర స్వాగతం పలికారు. అధికారులతో కలిసి ఆయన పర్యటన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిపాలన, అభివృద్ధి పనుల పురోగతి అంశాలపై ఈ సందర్బంగా చర్చలు జరిగాయి.