సత్యసాయి: సోమందేపల్లి మండలం చల్లాపల్లిలో మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన కురు మారుతీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బాబురెడ్డి పాల్గొన్నారు.