ASR: వారం రోజుల్లోగా కొయ్యూరు మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. మండలంలో 10,114 మంది రైతులకు గాను 5,808 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి అయిందని తెలిపారు. మిగిలిన 4,000 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలన్నారు.