VZM: పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మద్యాహ్న భోజన పథకాని అకస్మాత్తుగా పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి సహపంక్తిలో కూర్చుని ప్రార్ధన చేసి అనంతరం ఆహారాన్ని స్వీకరించారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా కడుకోవాలన్నారు.