NLR: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మంచి చేసింది తప్పా చెడు చేయలేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేశ్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకొని వారికి నగదును అందించింది టీడీపీ అన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజల ఆకలిని తీరుస్తున్నారని చెప్పారు.