కోనసీమ: గర్భిణిలు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతులైన బిడ్డలు పుడతారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమానికి సత్యానందరావు హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో వారికి ఆశీర్వాదం అందించారు.