NLR: చిల్లకూరు మండలం పొన్నవోలులో నేడు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పలువురు అధికారులు, టీడీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించారు. అనంతరం వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.