ప్రకాశం: నాగులుప్పలపాడు మండలంలోని నిడమానూరు ఉన్నత పాఠశాలను జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారిణి ప్రమోద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి వృత్తి విద్యా కోర్సుల బోధనకు ప్రభుత్వం అందించిన సామగ్రిని సద్వినియోగం చేయాలన్నారు.