TPT: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం పెరటాసి మాసానికి ముస్తాబైంది. పెరటాసి మాసం తొలి శనివారం రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.అత్యధిక శాతం మంది మహిళలు పిండి దీపాలను నైవేద్యంగా స్వామికి సమర్పించి భక్తితో వేంకటేశ్వర శత నామావళి,అష్టోత్తరాలను చదువుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు.